కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో మెగావాట్ సోలార్ విద్యుత్ ప్లాంట్, రూ. 10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కంప్యూటర్ భవనాలకు మంత్రి ఆదిమూలపు సురేశ్ శంకుస్థాపన చేశారు. ట్రిపుల్ ఐటీకి చెందిన రూ.180 కోట్ల నిధులను గత ప్రభుత్వం పసుపు కుంకుమ పథకానికి మళ్లించి ఆర్జీయూకేటీ అభివృద్ధిని నిర్వీర్యం చేసిందని మంత్రి ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
Minister Suresh: 'వర్సిటీల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి'
నూజివీడు ట్రిపుల్ఐటీలో సోలార్ విద్యుత్ ప్లాంట్కు విద్యాశాఖ మంత్రి సురేశ్ శంకుస్థాపన చేశారు. వర్సిటీల్లో నాణ్యమైన విద్య అందించేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
వర్సటీల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి