ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 24, 2021, 8:05 PM IST

ETV Bharat / state

వెనుక నుంచి లారీని ఢీకొని.. వ్యక్తి మృతి

మచిలీపట్నం - విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అతణ్ని గుంటూరుకు చెందిన గిరిబాబుగా పోలీసులు గుర్తించారు.

road accident
వెనుక నుంచి లారీని ఢీకొట్టిన మోటర్ సైకిల్.. వ్యక్తి మృతి

కృష్ణా జిల్లా మచిలీపట్నం- విజయవాడ జాతీయ రహదారి పై బల్లిపర్రు సమీపాన జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ముందుగా వెళుతున్న లారీ సడన్ బ్రేక్ వేయగా.. వెనుక నుంచి వస్తున్న మోటార్ సైకిల్ ఆ లారీని ఢీకొట్టడంతో ఈ విషాద ఘటన జరిగింది. మృతుడు గుంటూరు తోటకు చెందిన తూమాటి గిరిబాబుగా పోలీసులు గుర్తించారు. అతను గుడివాడ, మచిలీపట్నం పట్టణాల్లో ఆయుర్వేద మందుల రిప్రజెంటేటివ్​గా పని చేస్తుంటారని తెలిపారు. మృతదేహాన్నిగుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పామర్రు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details