ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'భాజపా ఓటమే లక్ష్యం'

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విశాఖ రైల్వేజోన్ మోసపూరితమని ఎంపీ కొనకళ్ల నారాయణ అభిప్రాయపడ్డారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఓకార్యక్రమానికి హాజరైన ఎంపీ.. భాజపాను ఓడించడమే లక్ష్యమన్నారు.

By

Published : Mar 3, 2019, 7:05 PM IST

ఎంపీ కొనకళ్ల నారాయణ

డాక్టర్ సీఎల్ వెంకట్రావుకు సన్మానం
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో20 ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ సీఎల్ వెంకట్రావును ఎంపీ కొనకళ్ల నారాయణ సన్మానించారు. డాక్టర్​కు ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా... కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఎక్కువ ఆదాయం ఉన్నవాల్తేరు డివిజన్​ను విశాఖ రైల్వే జోన్​లో కలపకపోవడం.. రాష్ట్రానికి అన్యాయం చేసినట్టేనన్నారు. విభజన హామీలను నెరవేర్చని భాజపాను ఓడించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details