కృష్ణా జిల్లా గుడివాడలో ఈనెల 9వ తేది నుంచి 25 వ తేదీ వరకు ఎన్టీఆర్ టు వైయస్సార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను నిర్వహించనున్నారు. కొడాలి ప్రీమియర్ టీ-20 రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల ఆహ్వాన పత్రికలను ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు.
రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఈ టోర్నమెంట్లో ప్రభుత్వ శాఖల జట్లతో పాటు... రాష్ట్రంలో గుర్తింపు పొందిన పలు ప్రతిష్టాత్మకమైన జట్లు పాల్గొంటున్నాయని ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి మెరుగుమాల కాళి తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి పర్వతనేని ఆనంద్, సభ్యులు దొప్పలపూడి రవి కేపీఎల్ టీ-20 టోర్నమెంట్ ఆర్గనైజర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.