ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వీరవల్లిలో భారీ చోరీ.. పోలీసుల దర్యాప్తు

కృష్ణా జిల్లా వీరవల్లిలో భారీ దొంగతనం జరిగింది. ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు.. బంగారం, వెండి, నగదు అపహరించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

By

Published : Aug 13, 2020, 4:14 PM IST

Published : Aug 13, 2020, 4:14 PM IST

huge theft in veeravalli krishna district
వీరవల్లిలో భారీ చోరీ.. పోలీసుల దర్యాప్తు

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. జాతీయ రహదారి పక్కన ఉన్న ఎన్టీఆర్ కాలనీలో అడపా రాఘవేంద్రరావు అనే వ్యక్తి ఇంట్లో.. 18 కాసుల బంగారం, కిలో వెండి, పది వేలు రూపాయల నగదు అపహరణకు గురైంది.

బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు.. ఘటన స్ధలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దొంగల కోసం గాలింపు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details