ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

20 బడుల్లో.. వెయ్యి మంది విద్యార్థినులకు సైకిళ్లు

జగ్గయ్యపేట నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఎన్నికల కోడ్ రీత్యా గత విద్యా సంవత్సరంలో పంపిణీ నిలిపివేశారు. ఇప్పుడు 20 పాఠశాలల్లో వెయ్యి మందికి పైగా బాలికలకు సైకిళ్లు అందించారు.

By

Published : Jul 8, 2019, 3:05 PM IST

govt-schools-cycles-distribution

ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలకు సైకిళ్లు పంపిణీ

రాజన్న బడిబాట పథకంలో భాగంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 9 ,10 తరగతులు చదువుతున్న బాలికలకు సైకిళ్లు పంపిణీ చేశారు. గత విద్యా సంవత్సరంలో అందజేయాల్సిన వీటిని ఎన్నికల కోడ్ రీత్యా పంపిణీ చేయలేదు. వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా అప్పటి సైకిళ్లను ఈ విద్యా సంవత్సరంలో బాలికలకు అందజేశారు. మొత్తంగా 20 ఉన్నత పాఠశాలల్లో వెయ్యి మంది విద్యార్థినులకు ఈ పథకంతో ప్రయోజనం చేకూరింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details