ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గణపయ్యరాకతో...మురిసిన భక్తజన సందోహం - ap news time

కృష్ణాజిల్లాలోని ప్రముఖ దేవస్థానాల్లో వినాయకచవితి వేడుకలు ఘనంగా ప్రారంభించారు. విజయవాడ దుర్గ గుడి, మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

గణపయ్యరాకతో...మురిసిన భక్తజన సందోహం

By

Published : Sep 2, 2019, 11:45 PM IST

కృష్ణా జిల్లాలో గణనాథుడి తొలిపూజ
వినాయక చవితి సందర్భంగా కృష్ణా జిల్లాలోని ప్రముఖ దేవాలయాల్లో తొలి పూజ ఘనంగా నిర్వహించారు. విజయవాడ దుర్గ గుడిలో మట్టి ప్రతిమకు ఈవో దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ రకాల పూలు, పండ్లు, పత్రాలతో మట్టి గణనాథుడిని ప్రార్థించారు. తాడేపల్లిలోని శ్రీ పంచముఖ వీరాంజనేయ సన్నిధిలో వినాయక వ్రతం చేపట్టారు. మూలమంత్ర, నవగ్రహ హోమాలు చేశారు. విజయవాడలోని బీసెంట్​రోడ్డు, గాంధీనగర్​, లెనిన్​, సత్యనారాయణపురం కూడళ్లలో భారీ విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేశారు. కోర్కెలు తీర్చే గణనాథుడు తమ వద్దకు వచ్చాడని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details