ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 8, 2023, 2:02 PM IST

ETV Bharat / state

Mandali Buddha Prasad: 'ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి.. రైతులను ఆదుకోవాలి'

Mandali Buddha Prasad: నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కృష్ణాజిల్లా మోపిదేవి తహసీల్దార్ కార్యాలయం ముందు మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ బైఠాయించి.. రైతులతో కలసి నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేవరకు దీక్షను విరమించేది లేదని బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు.

Mandali Buddha Prasad
మండలి బుద్ధప్రసాద్

Mandali Buddha Prasad: కృష్ణాజిల్లా మోపిదేవి తహసీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ బైఠాయించారు. పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని.. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంతవరకూ దీక్షను విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు మండలి బుద్దప్రసాద్‌.. తహసీల్దార్​కు వినతి పత్రం ఇచ్చి దీక్షకు కూర్చున్నారు.

గతంలో రైతులకు ఎలాంటి సమస్య వచ్చినా ప్రభుత్వాలు స్పందించి వారికి అండగా నిలిచేవని.. ముఖ్యమంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రైతులకు తామున్నామనే భరోసా కల్పించే వారిని అన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం.. రైతులు ఎంత నష్టపోయినా, వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఇంటి నుంచి కదలని ఏకైక వ్యక్తి అని విమర్శించారు. రైతులు పండించిన ప్రతి గింజను ఆర్​బికేల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ప్రతి దానికి రైతులు పోరాటం చేయాల్సి వస్తుందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేయడానికి, డబ్బు కోసం ఇలా ప్రతిదానికి పోరాటం చేయడానికే సమయం సరిపోతుందని అన్నారు.

రాష్ట్రంలో అసలు ఉద్యానవన శాఖ ఉందా అనే అనుమానం కలుగుతుందని బుద్ధప్రసాద్ అన్నారు. మోపిదేవి మండలంలో రైతుల సమస్య స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని బుద్ధప్రసాద్ అన్నారు.

గతంలో సబ్సిడీ పైన టార్బలిన్​లు అందజేసేవారని.. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో వాటి ఊసే లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అకాల వర్షాల కారణంగా పసుపు, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని.. గతంలో క్వింటాకు పసుపు ధర 6,550 రూపాయలు ఉండగా నేడు.. 3,300 రూపాయలకు కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదని పేర్కొన్నారు.

మొక్కజొన్న అయితే ఫిబ్రవరి వరకూ 2200 రూపాయలు ఉండగా నేడు 1500కు కూడా కొనుగోలు చేయడం లేదని బుద్ధప్రసాద్ అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నిటి పైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలని.. రెండు రోజులలోపు రైతుల వద్ద మిగిలిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి హామీ వచ్చేవరకు ఇక్కడే ఉంటానని మండలి బుద్ధప్రసాద్ తెలిపారు.

Mandali Buddha Prasad: 'ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి.. రైతులను ఆదుకోవాలి'

"అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం నుంచి స్పందన వచ్చేంతవరకూ నేను ఇక్కడే ఎన్ని రోజులైనా కూర్చుంటానని స్పష్టం చేస్తున్నాను. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని తహసీల్దార్​ను కోరుతున్నాను". - మండలి బుద్ధప్రసాద్‌, మాజీ ఉపసభాపతి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details