ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ.. రైతుల నిరసన

Farmers protest : రైతులు పండించిన పంటను ప్రభుత్వం కోనుగోలు చేయాలని ఎమ్మెల్సీ అర్జునుడు నిరసన చేపట్టారు. ప్రభుత్వ నిబంధనలు రైతులకు అందోళన కలిగిస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

By

Published : Dec 5, 2022, 5:20 PM IST

protest
రైతుల నిరసన

Farmers protest : కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగొలను వద్ద తెలుగురైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టారు. రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మచిలీపట్నం-కల్లూరు జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలు తమ పాలిట పాలిట శాపంగా మారాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ధర్నాలో టీడీపీ ఎమ్మెల్సీ అర్జునుడు పాల్గొన్నారు. రైతులకు సరైన గిట్టుబాటు ధర లేదని, కనీసం గోనె సంచులు కూడా అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details