కృష్ణా జిల్లాలోని నూజివీడు రెవెన్యూ డివిజన్లో ఎక్సైజ్ శాఖ టాస్క్ఫోర్స్ సిబ్బంది దాడులు నిర్వహించారు. చాట్రాయి, విస్సన్నపేట మండలాల్లో తనిఖీలు చేశామని టాస్క్ఫోర్స్ ఎస్సై బాలాజీ తెలిపారు. ఈ దాడుల్లో చాట్రాయి మండలం మర్లపాలెం గ్రామంలో వసంతరావుకు చెందిన పొలంలో 80 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కుప్పాల రామచంద్రరావు, మల్లేశ్వరరావు, రావు గోపాలరావులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు.
80 లీటర్ల సారాను పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు
చాట్రాయి మండలం మర్లపాలెం గ్రామంలో అక్రమంగా కాస్తున్న 80 లీటర్ల సారాను పోలీసులు గుర్తించారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ ఎస్సై బాలాజీ తెలిపారు.
సారాను పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు