అమ్మ ఆదాయం పెరుగుతోంది...! - hike
దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి ఆదాయం గణనీయంగా పెరిగింది. ఈ సందర్భంగా రూ.10కోట్లు పాత బకాయిలు చెల్లించామని ఆలయ ఈవో తెలిపారు. 10నెలల వ్యవధిలోనే దేవస్థానం ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.35కోట్లకు చేరాయని వెల్లడించారు.
![అమ్మ ఆదాయం పెరుగుతోంది...!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3920062-thumbnail-3x2-temple.jpg)
durga-malleswaram-temple-income-hike
గణనీయంగా పెరిగిన దర్గామల్లేశ్వర స్వామి ఆదాయం
కిందటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2018-19లో విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆదాయం గణనీయంగా పెరిగిందని.. ఆలయ ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు. ప్రసాదం విక్రయాలు, తలనీలాలపై వచ్చిన ఆదాయంతో పాటు.. హుండీ కానుకల రూపంలో మెరుగైన ఆదాయం వచ్చిందన్నారు. పాత బకాయిలు సుమారు 10కోట్ల మేర చెల్లించగా, మిగిలిన 35కోట్ల రూపాయల ఆదాయాన్ని దేవస్థానం పేరిట బ్యాంక్లో జమ చేసినట్లు ఆమె తెలిపారు.
Last Updated : Jul 23, 2019, 6:14 PM IST