ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాలకులు చేసిన పాపాలు.. పట్టిసీమ నీళ్లు చల్లుకుని కడుక్కోవాలి: దేవినేని

పోలవరం పట్టిసీమ వద్ద విడుదల చేసిన గోదావరి జలాలు ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్దకు చేరుకున్నాయి. తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. గోదారమ్మకు పసుపు , కుంకుమ ఇచ్చి, నూతన వస్త్రాలు అందించి స్వాగతం పలికారు. పాలకులు చేసిన పాపాలు పట్టిసీమ నీళ్లు చల్లుకుని కడుక్కోవాలని హితవు పలికారు.

By

Published : Jun 23, 2020, 2:15 PM IST

devineni
devineni

పాలకులు.. తాము చేసిన పాపాలను పట్టిసీమ నీళ్లు చల్లుకుని కడుక్కోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. పోలవరం నుంచి పట్టిసీమ ద్వారా గోదారి నీరు ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా దేవినేని ఉమా, స్థానిక తేదేపా నాయకులు అక్కడకు చేరుకుని గోదారమ్మకు పసుపు , కుంకుమ ఇచ్చారు.

నూతన వస్త్రాలు అందించి జలాలకు స్వాగతం పలికారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణలో కలిపిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని గుర్తు చేసారు. ఏడాది పరిపాలన చేసిన వైకాపా ప్రభుత్వం.. ఇప్పటికైనా రివర్స్ విధానాలను మానుకొని ప్రజా హితంగా పని చేయాలని ఆయన హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details