గుంటూరు జిల్లా కతేవరం గ్రామానికి చెందిన శ్రావ్య అనే చిన్నారి గత కొంత కాలంగా గుండె, కిడ్నీ, తదితర సమస్యలతో బాధపడుతోంది. ఇటీవల వైద్యులు ఆమె గుండెకు శస్త్ర చికిత్స చేశారు. పాపను రక్షించేకునేందుకు తల్లితండ్రులు లక్షల రూపాయలు ఖర్చుచేశారు. తండ్రి ఆటో డ్రైవర్ అయిన కారణంగా.. ఇబ్బంది పడుతున్నారు.
సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం తెలుసుకున్న కానిస్టేబుల్ నాగరాజు, మహిళా కానిస్టేబుల్ సువర్ణరేఖ దంపతులు.. వారి మిత్రులు కలిసి 60 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని బాధిత కుటుంబానికి అందించారు.