ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు వేల కోసం ఇరువర్గాల మధ్య ఘర్షణ... పలువురికి గాయాలు

రెండు వేల రూపాయల పాత లావాదేవీల గురించి రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. ఇరువర్గాలకు చెందిన యువకులు పరస్పరం దాడులు చేసుకోగా... పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

By

Published : Dec 22, 2020, 11:27 PM IST

clash
రెండు వేల కోసం దాడి

కృష్ణాజిల్లా గుడివాడ వాంబే కాలనీలో రెండు వేల రూపాయల పాత లావాదేవీల గురించి రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలమధ్య జరిగిన దాడిలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులు గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వివాదంపై రెండు గ్రూపులు గుడివాడ టూ టౌన్ పోలీస్​ స్టేషన్​లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details