ఉపవాస దీక్షలతో, దీపారాధనలతో, శివనామస్మరణలతో పవిత్రమైన కార్తిక పౌర్ణమి పండుగను జరుపుకొంటున్న భక్తులందరికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. మహాశివుని అనుగ్రహంతో అందరి ఇంట శుభాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
రాష్ట్రప్రజలకు కార్తిక పౌర్ణమి శుభాకాంక్షలు: చంద్రబాబు, లోకేష్
రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలు శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలియచేశారు. సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
చంద్రబాబు,లోకేశ్ : రాష్ట్రప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు