ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ కమిటీల ఏర్పాటు ఎంతో కీలకం'

పార్టీ కమిటీల ఏర్పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతో కీలకమని చంద్రబాబు పార్టీ నేతలతో అన్నారు. సంస్థాగత ఎన్నికలపై తెదేపా అధినేత చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

By

Published : Dec 7, 2019, 5:12 PM IST

Published : Dec 7, 2019, 5:12 PM IST

chandra babu on regional elections
చంద్రబాబు టెలికాన్ఫెరెన్స్

అందరికీ ఆమోదయోగ్యంగా పార్టీ కమిటీలు ఏర్పడాలని తెదేపా అధినేత చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ కమిటీల ఏర్పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమని స్పష్టం చేశారు. సంస్థాగత ఎన్నికలపై తెదేపా అధినేత చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే మూడోవంతు కమిటీల ఏర్పాటు పూర్తైందని చంద్రబాబు పార్టీ నేతలకు తెలిపారు. మిగిలినవీ శరవేగంగా పూర్తి చేయాలన్నారు.

పార్టీలో యువతకు, మహిళలకు పెద్దపీట వేయడంతో పాటు... 50శాతం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు కేటాయించినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. కంప్యూటరీకరణ త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details