ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గుండెపోటుతో మృతిచెందిన రాజధాని రైతుకు చంద్రబాబు సంతాపం

రాజధాని రైతు నన్నపనేని వెంకటేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందటంపై తెదేపా అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికే 65 మంది రైతులు బలయ్యారని తెలిపారు. వైకాపా పాలనకు రైతులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.

By

Published : Aug 3, 2020, 1:50 PM IST

Published : Aug 3, 2020, 1:50 PM IST

cbn condolence on capital farmer died due to cordial attack
cbn condolence on capital farmer died due to cordial attack

ముందురోజు వరకు కూడా అమరావతి పరిరక్షణ ఉద్యమంలో పాల్గొన్న రాజధాని రైతు.. నన్నపనేని వెంకటేశ్వరరావు తెల్లారేసరికి గుండెపోటుతో మరణించటం బాధాకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. రాజధాని కోసం 4 ఎకరాలిచ్చిన రైతు కుటుంబానికి ఈ ప్రభుత్వం తీరని శోకాన్ని బదులిచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. వైకాపా చేసిన నమ్మకద్రోహానికి ఇప్పటికే 65 మంది రాజధాని రైతులు, రైతుకూలీలు ప్రాణాలిచ్చారన్న ఆయన...ఇంకా ఎంతమంది రైతులు బలికావాలని నిలదీశారు. ఇన్ని కుటుంబాలు ఇక్కడ గుండెలు పగిలే బాధల్లో ఉంటే ఈ పాలకులకి కనీసం వచ్చి ఓదార్చే తీరికలేదా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.

ABOUT THE AUTHOR

...view details