ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దుర్గ గుడి హుండీ కేసులో ఒకరు కాదు.. ఇద్దరు నిందితులు!

దుర్గగుడి హుండీ లెక్కింపు చోరీ కేసులో మరో ఇద్దరి హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు.

By

Published : Jun 6, 2019, 3:13 PM IST

Updated : Jun 6, 2019, 6:03 PM IST

దుర్గ గుడి హండీ కేసులో మరో ఇద్దరి హస్తం

దుర్గ గుడి హుండీ కేసులో ఒకరు కాదు.. ఇద్దరు నిందితులు!

విజయవాడ దుర్గగుడి హుండీ లెక్కింపులో చోరీకి పాల్పడిన కేసు మరో మలుపు తిరిగింది. సింహాచలం, అన్నపూర్ణతోపాటు మరో ఇద్దరి హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సింహాచలం బంగారంతోపాటు రూ.10 వేలు చోరీ చేసినట్లు విచారణలో తేలింది. చోరీ చేసిన నగదును దుర్గారావు అనే మరో ఉద్యోగికి అందించినట్లు తెలిసింది. కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ఉదంతంతో దుర్గగుడిలో నిఘాను మరింత పటిష్టం చేస్తామని ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు. హుండీల లెక్కింపులో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారు. బంగారం, నగదు చోరీ జరిగినా గుర్తించని భద్రతాసిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Last Updated : Jun 6, 2019, 6:03 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details