కృష్ణా జిల్లా నందిగామ మండలం కొత్తకంచెలలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. తొలుత చెట్టుకింద కూర్చుని ఉన్న మహిళపై దాడి చేసిన కుక్క అనంతరం.. పాఠశాల నుంచి వస్తున్న విద్యార్థిపై దాడి చేసింది. గాయాలైన బాధితులను వెంటనే 108 వాహనంలో నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదే కుక్క గతంలోనూ అనేకమందిపై దాడి చేసిందని... అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పిచ్చికుక్క స్వైరవిహారం.. ఇద్దరికి తీవ్రగాయాలు
కొత్తకంచెలలో పిచ్చి కుక్క స్వైరవిహారం చేసింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా... ఆస్పత్రికి తరలించారు.
పిచ్చికుక్క స్వైరవిహారం