ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విస్మరిస్తున్న భౌతిక దూరం...కారాదు వైరస్ వ్యాప్తికి అవకాశం

వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం లాక్​డౌన్ నిబంధన నుంచి మినహాయింపునిచ్చింది. కూలీలు గుంపులుగా గుమిగూడకుండా, భౌతిక దూరం పాటిస్తూ పనులు చేసుకోవాలని సూచించింది. ఇదిలా ఉండగా.. కృష్ణా జిల్లా చాట్రాయిలో వ్యవసాయ పనులకు గుంపులుగా, ఒకే వాహనంలో ప్రయాణిస్తూ భౌతిక దూరం నిబంధనను విస్మరిస్తున్నారు.

By

Published : Apr 25, 2020, 1:28 PM IST

Agricultural laborers working in groups in krishna district
వ్యవసాయ కూలీలను అడ్డుకున్న పోలీసులు

కృష్ణా జిల్లా చాట్రాయిలో కూలీలు లాక్​డౌన్ నిబంధనను పాటించడం లేదు. మండలంలో మామిడి కాయల కోతలకు కూలీలను తరలించే క్రమంలో గుంపులుగా గుమిగూడుతున్నారు. మాస్కులు లేకుండా వాహనాల్లో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. ఈ వాహనాలను తనిఖీ చేయడంలో అధికారులు, పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details