ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వాస్పత్రిలో సేవలు మెరుగుపడాలి

కృష్ణా జిల్లా నూజివీడు ప్రభుత్వాస్పత్రిని సలహాకమిటీ సభ్యుడు దుట్ట రామచంద్రరావు సందర్శించారు. ఆస్పత్రిలో వైద్య సేవలపై ఆరా తీశారు.

By

Published : Jul 6, 2019, 2:50 PM IST

హాస్పిటల్

ప్రభుత్వాస్పత్రిలో సేవలు మెరుగుపడాలి

వైద్యం, ఆరోగ్యం ఎలా మెరుగు పరచాలి అనే అంశంపై ప్రభుత్వం సలహాకమిటీ వేసిందని.. అందులో భాగంగానే కమిటీ సభ్యుడు దుట్ట రామచంద్ర రావు కృష్ణా జిల్లా నూజివీడు ఏరియా హాస్పిటల్ సందర్శించారు. ఆస్పత్రిలో వైద్య సౌకర్యాలపై ఆరా తీశారు. చికిత్సపై రోగులను అడిగి తెలుసుకున్నారు.4 కోట్ల 50 లక్షల మంది ఆరోగ్యశ్రీ పథకం కిందకు వస్తారని దాని కోసం ప్రత్యేక ఆరోగ్య శ్రీ కార్డు రూపొందిస్తున్నామని తెలిపారు. నూజివీడు ఏరియా ఆస్పత్రిని 150 పడకల ఆసుపత్రిగా మారుస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details