ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ వైద్యం: రూ.4 లక్షల మందులు అందజేసిన వైకాపా నేత

గుంటూరు జిల్లా చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పిలుపు మేరకు వైకాపా నాయకుడు రమేష్ రూ.4 లక్షలు విలువ చేసే మందులను అందజేశారు. ఆపద కాలంలో దాతలు అందిస్తున్న సహకారాన్ని ఎంపీ కొనియాడారు.

By

Published : May 19, 2021, 3:33 PM IST

రూ.4 లక్షల మందులు అందజేసిన వైకాపా నేత
రూ.4 లక్షల మందులు అందజేసిన వైకాపా నేత

ఆపద కాలంలో దాతలు అందిస్తున్న సహకారం మరువలేనిదని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కొనియాడారు. చిలకలూరిపేట 30 పడకల సామాజిక ఆసుపత్రికి వైకాపా నాయకుడు నాయుడు రమేష్ రూ.4 లక్షల విలువైన మందులను బుధవారం ఎంపీ చేతుల మీదగా ఆస్పత్రి అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ... ప్రభుత్వ ఆసుపత్రికి సాయం అందించేందుకు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని అన్నారు. పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కొవిడ్ వైద్యానికి అవసరమైన మందులు, ఆక్సిజన్ తదితర సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇదే స్ఫూర్తితో దాతలు ముందుకొచ్చి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details