ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోడెల మృతిపై యనమల తీవ్ర దిగ్భ్రాంతి

కోడెల మృతి పట్ల తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

By

Published : Sep 16, 2019, 4:17 PM IST

కోడెల మృతిపై యనమల తీవ్ర దిగ్భ్రాంతి

తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ శాసన సభాపతి కోడెల శివప్రసాద రావు మృతి పట్ల యనమల రామకృష్ణుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఆయన చివరి శ్వాస దాకా పరితపించారని అన్నారు. వ్యక్తిగతంగా ఒక గొప్ప స్నేహితుణ్ని కోల్పోయానని విచారించారు. వైకాపా ప్రభుత్వం రాజకీయ కక్షతో మానసిక వేధింపుల వల్లే మృతి చెందారని ఆరోపించారు. ప్రభుత్వ ఒత్తిళ్లతో అనేక క్రిమినల్ కేసులు పెట్టారని, కుటుంబ సభ్యులనూ వేధించారని ఆక్షేపించారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాతం పోరాట యోధుణ్ని కోల్పోయిందని, కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని యనమల ప్రార్ధించారు.

ABOUT THE AUTHOR

...view details