ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రేపల్లెలో వివాహిత ఆత్మహత్యాయత్నం... పరిస్థితి విషమం

రేపల్లెలోని 7వ వార్డ్​ ఏకలవ్య కాలనీకి చెందిన మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు గమనించి ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

By

Published : Oct 17, 2020, 1:07 AM IST

Published : Oct 17, 2020, 1:07 AM IST

repalle woman attempt suicide
భార్యభర్తల మధ్య గొడవతో మనస్థాపం

భార్యాభర్తల మధ్య గొడవలో మనస్థాపం చెందిన మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన రేపల్లెలో చోటు చేసుకుంది. 7వ వార్డ్​ ఏకలవ్య కాలనీకి చెందిన పోలేరమ్మకు(28)... 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. భర్త మద్యానికి బానిసయ్యాడు. తరచూ వీరి మధ్య గొడవలు జరిగేవని స్థానికులు తెలిపారు. అయితే శుక్రవారం మద్యం తాగేందుకు భార్యను డబ్బులు అడగగా... మద్యం తాగొద్దని పోలేరమ్మ చెప్పడంతో ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. అనంతరం మనస్థాపం చెందిన పోలేరమ్మ... ఒంటిపై కిరోసిన్​ పోసుకుని నిప్పుంటించుకుంది. గమనించిన స్థానికులు మంటలు ఆర్పి... ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. శరీరం ఎక్కువగా కాలడం వల్ల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో ఆమెను గుంటూరు జీజీహెచ్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details