గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో బేతపూడి గ్రామస్థులు గ్రామ సచివాలయం వద్ద నిరసనకు దిగారు. ప్రభుత్వం పేదలకు నివేశన స్థలాలు ఇస్తోంది. అందుకు బేతపూడి గ్రామస్థులు 60 మంది దరఖాస్తు చేసుకున్నారు. స్థలాలు మంజూరయ్యాయి. అయితే బేతపూడి వాసులకు గ్రామంలో కాకుండా సమీప గ్రామంలోని గుండాలపాడులో స్థలాలు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గుండాలపాడులో తమకు స్థాలాలు వద్దని ...ప్రస్తుతం ఉండే బేతపూడి గ్రామంలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గ్రామస్థులు కోరుతున్నారు.
'మా గ్రామంలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వండి.. అక్కడ మాకొద్దు'
ప్రభుత్వం పేదప్రజలకు మంజూరు చేస్తున్న నివేశన స్థలాలపై పలు గ్రామాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వారు నివసిస్తున్న ప్రాంతాల్లోనే స్థలాలు ఇవ్వాలని గ్రామస్థలు డిమాండ్ చేస్తున్నారు.
villagers dharna