ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 6, 2020, 12:58 AM IST

ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో ట్రాన్స్​జెండర్ మృతి

అనుమానాస్పద స్థితిలో ట్రాన్స్​జెండర్ మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా సిరిపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

అనుమానస్పద స్థితిలో ట్రాన్స్​జెండర్ మృతి !
అనుమానస్పద స్థితిలో ట్రాన్స్​జెండర్ మృతి !

గుంటూరు జిల్లా మెడికొండ్రు మండలం సిరిపురంలో కోమాలి అనే ట్రాన్స్​జెండర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకొని చనిపోయింది. కోమాలి కాళ్ల వద్ద రక్తపు మరకలు ఉండటంతో... మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. మృతురాలి తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details