ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్​వి​ లాలూచీ రాజకీయాలు: తెదేపా ఎమ్మెల్యేలు

వైకాపా పాలనపై తెదేపా ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్​, మద్దాలి గిరిధర్​ దుయ్యబట్టారు.

By

Published : Aug 2, 2019, 12:15 PM IST

మీడియా సమావేశంలో తెదేపా ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్​, మద్దాలి గిరిధర్​

మీడియా సమావేశంలో తెదేపా ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్​, మద్దాలి గిరిధర్​

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలకు కష్టాలు, కన్నీళ్లే తప్ప... జరిగిన మేలు ఏమీ లేదని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాబోయే రోజుల్లో పరమాన్నం పెడతాం.. ఇప్పుడు పస్తులు ఉండండి అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కేసీఆర్‌ నుంచి సాయం పొందినందుకే జగన్‌ ఇప్పుడు లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ ఒప్పందాలపై సమీక్ష వద్దని కేంద్రం రెండుసార్లు లేఖ రాసినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ దుయ్యబట్టారు. గతంలో వైఎస్ ఇలాగే సమీక్షల పేరుతో వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details