ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'కరోనా సమయంలో... వేలిముద్రలు ఎందుకు..?'

By

Published : Apr 30, 2020, 5:11 PM IST

రాష్ట్రంలో బుధవారం నుంచి మూడో విడత రేషన్‌ పంపిణీ ప్రారంభమైంది. అయితే నిత్యావసరాలు పొందేందుకు వేలిముద్రను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశించడాన్ని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ తప్పుబట్టారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఈ విధానం సరైంది కాదని హితవు పలికారు.

kanna letter to cm jagan
kanna letter to cm jagan

సీఎం జగన్​కు కన్నా రాసిన లేఖ

రేషన్ పంపిణీకి వేలిముద్రను తప్పనిసరి చేయడాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తప్పుబట్టారు. కరోనా విస్తరిస్తున్న సమయంలో వేలిముద్రలు వేయాలనటం సరైన నిర్ణయం కాదన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాశారు. దీనివల్ల వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే వేలిముద్రల విధానాన్ని నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత కావాలంటే అమలు చేయవచ్చని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details