బైక్ను ఢీకొట్టిన మినీ వ్యాను... ఒకరి మృతి
గుంటూరు జిల్లా బొప్పూడిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి మినీ వ్యాను ఢీకొట్టటంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గుంటూరుకు చెందిన షేక్ షాజుద్దీన్ బాబావలి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో వెనకనుంచి మినీ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బాబావలి మృతిచెందాడు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట గ్రామీణ ఎస్ఐ భాస్కర్ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.