ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రంజాన్ మాసంలో ప్రజలకు సదుపాయాల కల్పనపై కలెక్టర్ సమావేశం

పవిత్ర రంజాన్‌ మాసంలో ముస్లింలు మసీదుల్లో ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా మౌలిక సదుపాయాలను కల్పించాలని, అందుకోసం అధికారులు సమన్వయంతో పనిచేయాలని గుంటూరు జిల్లా సంయుక్త పాలనాధికారి హిమాన్షు శుక్లా తెలిపారు.

By

Published : Apr 27, 2019, 7:59 AM IST

రంజాన్ ఏర్పాట్లు

ముస్లిం సోదరుల ఉపవాసాలకు అన్ని ఏర్పాట్లు

పవిత్ర రంజాన్‌ మాసంలో ముస్లింలు మసీదుల్లో ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా మౌలిక సదుపాయాలను కల్పించటంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని గుంటూరు జిల్లా సంయుక్త పాలనాధికారి హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. గుంటూరు కలెక్టరేట్‌లో రంజాన్‌ మాసంలో ప్రజలకు సదుపాయాల కల్పనపై అనుబంధ శాఖలతో సమావేశమయ్యారు. గత సంవత్సరం అన్నిచోట్ల ప్రశాంత వాతావరణంలో ప్రార్థనలు, పండుగ జరిగేలా చర్యలు చేపట్టామని... ఈ ఏడాది కూడా అదే తరహాలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్, తాగునీరు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మే 6 నుంచి జూన్ 6 వరకు మసీదుల వద్ద ప్రత్యేక సదుపాయాలు కల్పించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details