ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంగళగిరిలో నియోజకవర్గంలో సర్వే కలకలం

గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీలక్ష్మీ నృసింహస్వామి కాలనీలో సర్వే చేస్తున్నారంటూ రాంకీ గ్రూప్ కు చెందిన నలుగురు వ్యక్తులను తెలుగుదేశం కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. తెలంగాణ రిజిస్ట్రేషన్ కార్లలో వచ్చారని... సర్వే పేరుతో ప్రజలకు నగదు పంపిణీ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

By

Published : Apr 1, 2019, 4:24 AM IST

Updated : Apr 1, 2019, 5:30 AM IST

మంగళగిరిలో నియోజకవర్గంలో సర్వే కలకలం

మంగళగిరిలో నియోజకవర్గంలో సర్వే కలకలం
గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీలక్ష్మీ నృసింహస్వామి కాలనీలో సర్వే చేస్తున్నారంటూ రాంకీ గ్రూప్ కు చెందిన నలుగురు వ్యక్తులను తెలుగుదేశం కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. తెలంగాణ రిజిస్ట్రేషన్ కార్లలో వచ్చారని... సర్వే పేరుతో ప్రజలకు నగదు పంపిణీ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి వద్ద ఉన్న బ్యాగుల్లో మరింత డబ్బు ఉందని పోలీసులకు తెలిపారు. సమాచారం తెలుసుకున్న డీఎస్పీ రామకృష్ణ విచారణ చేపట్టగా... వారి వద్ద సుమారు 46వేల నగదు ఉన్నట్లు గుర్తించారు. సర్వేకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేనందున.. పోలీసులు వారి వివరాలు తీసుకొని వదిలేశారు. మరోవైపు మంగళగిరి వైకాపా అభ్యర్థికి కేసీఆర్ వందల కోట్ల రూపాయలు పంపిస్తున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. ఎలాంటి సర్వే చేయలేదని తమకు తెలిసిన వ్యక్తులు ఆపరేషన్ చేయించుకుంటే చూడటానికి వచ్చామని రాంకీ గ్రూపు ప్రతినిధి చెప్పారు.

ఇదీ చదవండి

Last Updated : Apr 1, 2019, 5:30 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details