గుంటూరు జిల్లా రేపల్లె మండలం పేటేరు వద్ద ఎడ్లబండిని ద్విచక్రవాహనం ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పేటేరుకు చెందిన కల్యాణ్ చక్రవర్తి అనే యువకుడు ద్విచక్రవాహనంపై రేపల్లె పట్టణానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు ఎడ్లబండిని వెనుక నుంచి ఢీ కొట్టాడు. తీవ్రగాయాలు కావడంతో అతన్ని, స్థానికులు సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఎడ్లబండిని ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. వ్యక్తి మృతి
ఎడ్లబండిని ద్విచక్రవాహనం వెనక నుంచి ఢీకొట్టింది. దాంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎద్దుల బండిని ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. వ్యక్తి మృతి