గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఓ ప్రైవేటు కళాశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. నీట్లో సీటు గ్యారంటీ పేరుతో.. సంవత్సరం క్రితం ఒక్కో విద్యార్థి వద్ద రూ.5 లక్షలు తీసుకొని లాంగ్ టర్మ్ శిక్షణ ఇచ్చారని.. ఈ ఏడాది ఒక్క తరగతి కూడా నిర్వహించలేదని ఆరోపించారు. నీట్లో సీటు రాకపోతే విద్యార్థి నుంచి తీసుకున్న డబ్బులో సగం తిరిగి చెల్లిస్తామని.. కళాశాల యాజమాని గురుబ్రహ్మం హామీ ఇచ్చారని వారు తెలిపారు.
తమ పిల్లలకు సరైన భోజనం అందించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. దీనిపై కళాశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. సోమవారం నుంచి అన్ని తరగతులు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు శాంతించారు.