ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేశవ్యాప్త ఎన్​ఆర్​సీని వ్యతిరేకిస్తాం: వైకాపా ఎంపీ

అమరావతి కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తామని సీఎం జగన్ హామీఇచ్చారని... ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చెందవద్దని, అందరనీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. దేశవ్యాప్త ఎన్​ఆర్​సీ అమలును వైకాపా ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.

By

Published : Dec 24, 2019, 4:56 PM IST

lavu srikrishna devarayalu
లావు శ్రీకృష్ణదేవరాయలు

మీడియాతో మాట్లాడుతున్న లావు శ్రీకృష్ణదేవరాయలు

మూడు రాజధానులు వచ్చినా... అమరావతి రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట వైకాపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భూములిచ్చిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని ఎంపీ అభిప్రాయపడ్డారు. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని తెలిపారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఎన్​ఆర్​సీ (జాతీయ నమూనా పట్టిక)పై ఎంపీ మాట్లాడారు. దేశవ్యాప్త ఎన్​ఆర్​సీని వైకాపా వ్యతిరేకిస్తోందని ఆయన తెలిపారు. కేంద్రం ఎన్​ఆర్​సీ బిల్లు తెస్తే... దానిని ఆంధ్రప్రదేశ్​లో అమలు చేయబోమని ఎంపీ అన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details