మూడు రాజధానులు వచ్చినా... అమరావతి రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట వైకాపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భూములిచ్చిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని ఎంపీ అభిప్రాయపడ్డారు. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని తెలిపారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఎన్ఆర్సీ (జాతీయ నమూనా పట్టిక)పై ఎంపీ మాట్లాడారు. దేశవ్యాప్త ఎన్ఆర్సీని వైకాపా వ్యతిరేకిస్తోందని ఆయన తెలిపారు. కేంద్రం ఎన్ఆర్సీ బిల్లు తెస్తే... దానిని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయబోమని ఎంపీ అన్నారు.
దేశవ్యాప్త ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తాం: వైకాపా ఎంపీ
అమరావతి కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తామని సీఎం జగన్ హామీఇచ్చారని... ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చెందవద్దని, అందరనీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. దేశవ్యాప్త ఎన్ఆర్సీ అమలును వైకాపా ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.
లావు శ్రీకృష్ణదేవరాయలు