గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం పంచాయతీ రాజ్ అవార్డుకు ఎంపికైనట్లు అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు సేవలందించడంలో మెరుగైన పనితీరును కనపరిచిన మండలానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సౌశక్తి కిరణ్ పురస్కార్ అవార్డులు ఇస్తుంది.
ఈ ఏడాది మేడికొండూరు మండలానికి ఈ అవార్డు దక్కింది. తాగునీరు, మౌలిక వసతులు, విపత్తు నిర్వహణ, గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి వ్యక్తిగత సహాయం, ఆదాయ ఆర్జనలో కొత్త విధానాలు, ఈ గవర్నెన్స్ విభాగాల్లో ఆయా పంచాయతీరాజ్ సంస్థలు తీసుకునే ఉత్తమ చర్యలు వంటివి పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా అవార్డులు ప్రకటిస్తుంది.అలానే ఈ ఏడాది కూడా ప్రకటించింది.