ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రిజర్వాయర్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి: మేయర్​

సంపత్​నగర్​లో నూతనంగా చేపడుతున్న రిజర్వాయర్​ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని గుంటూరు నగర మేయర్​ కావటి మనోహర్​ నాయుడు అన్నారు. త్వరగా టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

By

Published : May 20, 2021, 9:25 PM IST

Published : May 20, 2021, 9:25 PM IST

guntur mayor
గుంటూరు మేయర్​

సంపత్​నగర్​లో రిజర్వాయర్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్మాణానికి కావాల్సిన ప్రభుత్వ స్థలం కోసం ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి వార్డులో పర్యటించారు. సంపత్​నగర్, పార్వతీపురం, రామచంద్రాపురం, బాబు రాజేంద్రనగర్, కొబ్బరి చెట్టు ఏరియా ప్రజల దాహార్తి తీర్చుటకు ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటుకు పూనుకున్నారు.

15వ ఆర్ధిక సంఘం నిధులతో ట్యాంక్ నిర్మాణానికి అంచనాలు సిద్దం చేశారు. ఈ కొత్త ట్యాంక్​ పూరైతే ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య తీరనుందని మేయర్ అన్నారు. టెండర్​కు సంబంధించిన పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఇదీ చదవండి:స్టేట్​లో ఫస్ట్​టైం: గుంటూరు జిల్లాలో రెమిడిసివిర్ తయారీ

ABOUT THE AUTHOR

...view details