ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రతి ఇంటికి తాగునీరు : మంత్రి లోకేశ్

రాష్ట్రంలో తాగునీటి సమస్యను పరిష్కరించి ప్రతి ఇంటికి తాగునీరందిస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన పసుపు-కుంకుమ పథకం దేశంలో ఎక్కడా ఆమలు చేయటం లేదన్నారు.

మంత్రి లోకేశ్ ప్రచారం

By

Published : Apr 6, 2019, 5:03 PM IST

మంత్రి లోకేశ్ ప్రచారం

ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో మంత్రి లోకేశ్ ప్రచారం నిర్వహించారు. మడలంలోని అన్ని గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. తెదేపా ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని వ్యాఖ్యానించారు. పసుపు-కుంకుమ పథకం దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయటం లేదన్నారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించి మెుక్కజొన్నకు సబ్సిడీ ఇప్పించే బాధ్యత తీసుకుంటామన్నారు. తాగునీటి సమస్యకు పూర్తిగా పరిష్కరించి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరందిస్తామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details