ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

8న మార్కెట్​లోకి కియా కొత్త కారు..సీఎంకు ఆహ్వానం

​​​​​​​ఈ నెల 8న కియా కొత్త కారు సెల్తోస్‌ మార్కెట్‌లోకి విడుదల కానుంది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్​ను కియా ప్రతినిధులు ఆహ్వానించారు. ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. కార్యక్రమానికి హాజరవుతానని జగన్ హామీ ఇచ్చారు.

By

Published : Aug 5, 2019, 6:19 PM IST

kia-jagan

8న కియా కొత్త కారు సెల్తోస్​ విడుదల-సీఎంకు ఆహ్వానం

ఈనెల 8న కియా కొత్త కారు ‘సెల్తోస్‌’ను మార్కెట్​లోకి విడుదల చేయనున్నట్లు కియా సంస్థ ప్రతినిధులు తెలిపారు. అమరావతిలో సీఎం జగన్‌ను కలిసి కొత్తకారు విడుదల కార్యక్రమానికి ఆహ్వానించారు. కంపెనీ ఎండీ కూక్‌ హ్యున్‌ షిమ్, చీఫ్‌ అడ్మినిస్ట్రేవ్‌ ఆఫీసర్‌ థామస్‌ కిమ్‌ ఆహ్వానపత్రికను ముఖ్యమంత్రికి అందజేశారు. కార్యక్రమానికి హాజరవుతానని సీఎం జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కియా కంపెనీ పనితీరు, భవిష్యత్ లక్ష్యాలను...సంస్థ ప్రతినిధులు సీఎంకు వివరించారు. అనంతపురం జిల్లా పెనుగొండ ప్లాంటుద్వారా ఏడాదికి 3 లక్షల కార్లను ఉత్పత్తి చేయగలమని తెలిపారు. భవిష్యత్తులో 7 లక్షల కార్లను తయారుచేసే సామర్థ్యానికి చేరుకుంటామని సీఎం జగన్‌కు వివరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details