ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రజల కోసమే తెదేపా పోరాడుతుంది: జీవీ ఆంజనేయులు

By

Published : Aug 30, 2020, 12:49 AM IST

గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు వైకాపా పాలనపై విమర్శలు చేశారు. పేద ప్రజలకు ఇళ్లు ఇప్పించేందుకు.. తమ పార్టీ పోరాడుతుందన్నారు.

gv anjaneyulu comments on jagan
gv anjaneyulu comments on jagan

తెదేపా హయంలో అర్బన్ హౌసింగ్​కు కట్టుబడి 90 శాతం పూర్తి చేశామని గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. వైకాపా పాలనలో ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తే.. అదే ఇసుకను వైకాపా రూ.3500 నుంచి రూ.4500 వరకు ధరలు పెట్టి అమ్ముతుందన్నారు. ఫోన్ కొట్టు లిక్కర్ హోమ్ డెలివరీ పట్టు అన్నట్లుగా ప్రజల సొమ్ము నాశనం చేస్తున్నారని ఆరోపించారు. కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకి రూ.20 లక్షలు ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details