ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్దాలి సీటు కోసం కార్యకర్తల ఆందోళన

గుంటూరు పశ్చిమ నుంచి తెదేపా బరిలో ఉన్న మద్దాలి గిరిధర్ పోటీ స్థానం యోచనలో అధిష్ఠానం ఉందన్న సమాచారంతో ఆయన అభిమానులు ఆందోళన బాటపట్టారు. గుంటూరులో ఎంపీ గల్లా జయదేవ్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు.

By

Published : Mar 19, 2019, 6:27 AM IST

మద్దాలి గిరిధర్

మద్దాలి గిరిధర్

అధిష్ఠానం ఆదేశాల మేరకు గుంటూరు పశ్చిమలో ఎన్నికల సమరానికి సిద్ధమైన మద్దాలి గిరిధర్​కు పార్టీ మరోసారి స్థానం చలనం సంకేతాలు అందాలి. నరసరావుపేట, తెనాలి రెండింటిలో ఓ చోట పోటీ చేయాలని తాజా అధిష్ఠానం సూచించింది. అధినాయకత్వ నిర్ణయం మార్పుతో గిరిధర్ మనస్తాపం గురై, ఎంపీ గల్లా జయదేవ్ కలిసి తన ఆవేదనను తెలిపారు. సీటు మార్పుతో గిరిధర్ అభిమానులు, అనుచరులు ఆందోళన బాటపట్టారు. పశ్చిమ టిక్కెట్ గిరిధర్​కే కేటాయించాలని గల్లా జయదేవ్ ఇంటి ముందు ఆందోళన చేశారు. అధిష్ఠానంతో మాట్లాడతానని ఎంపీ హామీ ఇవ్వడం వలన కార్యకర్తలు ఆందోళన విరమించారు.

ABOUT THE AUTHOR

...view details