ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా పాజిటివ్​ కేసులతో మిర్చియార్డు మూసివేత

గుంటూరులో కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వటంతో మిర్చి యార్డును ఈ నెలాఖరు వరకు మూసివేయాలని అధికారులు నిర్ణయించారు.

By

Published : Apr 8, 2020, 4:06 AM IST

కరోనా పాజిటివ్​ కేసులతో మిర్చియార్డు మూసివేత
కరోనా పాజిటివ్​ కేసులతో మిర్చియార్డు మూసివేత

గుంటూరు మిర్చియార్డును ఈనెలాఖరు వరకు మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. మిర్చియార్డు అధికారులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత కార్యకలాపాలు ప్రారంభించాలని భావించినా యార్డు సమీపంలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వడంతో విరమించుకున్నారు. ఆ ప్రాంతంలో 3కిలోమీటర్ల మేర రెడ్‌జోన్‌గా గుర్తించారు. కంటైన్‌మెంట్‌ జోన్‌లోకి ఇతర ప్రాంతాల వారు వస్తే వైరస్‌ వ్యాపిస్తుందన్న ఉద్దేశంతో నెలాఖరు వరకు మూసివేయాలని నిర్ణయించారు. గుంటూరు జిల్లాలోని దుర్గి, నడికుడి, పిడుగురాళ్ల మార్కెట్ యార్డుల్లో లావాదేవీలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details