పాఠశాలకు హాజరు కాకుండా ఇంట్లోనే ఉంటూ బయోమెట్రిక్ యంత్రంతో హాజరు వేస్తున్న ఉపాధ్యాయురాలిపై సస్పెన్షన్ వేటు పడింది. గుంటూరు జిల్లా యడ్లపాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల( ఓల్డ్ యూపీ)లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న పీ. ఉమాదేవి పాఠశాలకు రాకుండా బయెమెట్రిక్ యంత్రంతో హాజరు వేస్తున్నట్లు గుర్తించారు. దీంతో డీఈవో గంగాభవాని ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సదరు ఉపాధ్యాయురాలిపై క్రిమినల్ కేసు నమోదు చేసే యోచనలో డీఈవో ఉన్నట్లు సమాచారం.
దీనిపై యడ్లపాడు మండల విద్యాశాఖాధికారి డేవిడ్ రత్నంను వివరణ అడగ్గా.. ఆమెను సస్పెండ్ చేసినట్లు ఇంకా అధికారికంగా తనకు ఉత్తర్వుల అందలేదన్నారు.