గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండెమెడలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ను తొలగించాలని గ్రామస్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు, గ్రామస్థుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పటం వల్ల పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఈ క్రమంలో పోలీసులపై గ్రామస్థులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పోలీసులు, క్వారంటైన్లో ఉన్నవారికి గాయాలయ్యాయి.
క్వారంటైన్ తొలగించాలని గ్రామస్థుల ఆందోళన.. ఉద్రిక్తత
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండెమెడలో క్వారంటైన్ కేంద్రం తొలగించాలని గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. పరిస్థితి అదుపు తప్పటంతో గ్రామస్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు.
క్వారంటైన్ తొలగించాలని గ్రామస్తుల ఆందోళన