ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆలయ నిర్మాణానికి ఊరు కదిలింది.. రూ.23 లక్షలు సేకరించింది

ఆలయ నిర్మాణానికి ఊరంతా ముందుకొచ్చారు. శ్రీస్వరాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయ నిర్మాణానికి రూ. 23లక్షలు పోగుచేశారు. వాట్సాప్ గ్రూప్‌లో మెసెజ్​ చేయగానే ఆ గ్రామస్థులు, ఎన్నారైలు స్పందించారు. గుంటూరు జిల్లాలోని కోరుతాడిపర్రులో ఆలయం నిర్ణాణం కోసం ఊరంతా కదిలింది.

By

Published : Jun 18, 2021, 2:07 PM IST

funds collection
funds collection

గుంటూరు జిల్లా అమర్తలూరు మండలం కోరుతాడిపర్రులో ఆలయ నిర్మాణానికి 23లక్షల రూపాయల దాకా విరాళాలు పోగయ్యాయి. 200 ఏళ్ల నాటి శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం పక్కనే శ్రీస్వరాజ్యలక్ష్మి అమ్మవారి గుడి ప్రతిష్ఠకు పూనుకున్న గ్రామస్థులు.. చందాల కోసం ఓ వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. గ్రామస్థులు, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్నవారు సైతం ముందుకురావటంతో 2లక్షలు లక్ష్యంగా మొదలైన సేకరణ..22 లక్షలకుపైగా చేరింది. త్వరలోనే రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ ఉంటుందని చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details