అమెరికాలో గుండెపోటుకు గురై మృతిచెందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ బి.ప్రసాదరావుకు... గుంటూరు జిల్లాతో అనుబంధం ఉంది. ఆయన మేనమామ, తెనాలి వాసి వి.ఎలీషా.. ఈ వివరాలను పంచుకున్నారు. శ్రీనివాసరావు, సుశీలమ్మ దంపతుల కుమారుడైన ప్రసాదరావు.. తెనాలి మండలం తేలప్రోలు గ్రామంలో జన్మించారు. వీరి ఐదుగురు సంతానంలో ఈయన తొలి బిడ్ఢ. తండ్రి శ్రీనివాసరావుది ఏలూరు ప్రాంతంలోని శనివారపుపేట. తల్లి సుశీలమ్మది తేలప్రోలు. శ్రీనివాసరావు.. పోలీసు కానిస్టేబుల్గా తెనాలి, నరసరావుపేట, గుంటూరు, కొల్లూరు ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. తండ్రి పనిచేసిన ప్రాంతాల్లో ప్రసాదరావు ప్రాథమిక విద్యాభ్యాసం నడిచింది.
ఇంటర్, డిగ్రీలను విజయవాడ లయోలా కళాశాలలో చదివిన ఆయన ఎంఎస్సీ (ఫిజిక్స్)ని ఐఐటీ చెన్నైలో పూర్తిచేశారు. 1979లో ఐపీఎస్కు ఎంపికయ్యారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఏలూరు, కర్నూలు డీఐజీగా, విశాఖ, హైదరాబాద్ సిటీ కమిషనర్గా ఏసీబీ డీజీగా, ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వర్తించి, తుదిగా రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ 2015లో ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు తెనాలిలో సొంత ఇల్లు ఉంది. ఉద్యోగ విరమణ తర్వాత హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆఫీసర్స్ కాలనీలో తన స్వగృహంలో ప్రసాదరావు దంపతులు నివసించారు. వీరి కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. మనవడిని చూడడానికి ఈ ఏడాది మార్చి 24న ఈ దంపతులు అమెరికా వెళ్లారు.
ఈనెల 18న జరిగే మనవడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని వీరు తిరిగి రావాల్సి ఉంది. అయితే ఇంతలోనే ప్రసాదరావుకు ఆదివారం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్కు తీసుకురావడానికి బంధువులు ప్రయత్నిస్తున్నారు.
గత ఏడాది తెనాలికి: