గుంటూరు జిల్లా పేరేచర్ల గ్రామం బుడగజంగాల కాలనీలో 5 పూరిగుడిసెలు దగ్ధమయ్యాయి. ఉర నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో వంటగ్యాస్ లీక్ అవటంతో ప్రమాదం జరిగింది. పెద్దఎత్తున మంటలు చెలరేగటంతో వరుసగా ఉన్న పూరిళ్లు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ప్రమాదంలో ఉర నాగరాజు, గంధం వెంకటేశ్వర్లు, కొత్తూరి చిన్న గోపి, పోస్తాం కాలయ్య, పోస్తాం ఆంజనేయులు ఇండ్లు పూర్తిగా తగలబడిపోయాయి. సుమారు రూ.25 లక్షలు నష్టం వచ్చిందని బాధితులు వాపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై వివరాలు సేకరించారు.