ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వంటగ్యాస్​ లీక్​.. 5 పూరి గుడిసెలు దగ్ధం

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామం బుడగజంగాల కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 5 పూరిళ్లు కాలిపోయాయి.

By

Published : Nov 1, 2020, 1:49 PM IST

Updated : Nov 1, 2020, 8:20 PM IST

fire accident
తగలబడిపోతున్న ఇండ్లు

తగలబడిపోతున్న ఇండ్లు

గుంటూరు జిల్లా పేరేచర్ల గ్రామం బుడగజంగాల కాలనీలో 5 పూరిగుడిసెలు దగ్ధమయ్యాయి. ఉర నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో వంటగ్యాస్ లీక్ అవటంతో ప్రమాదం జరిగింది. పెద్దఎత్తున మంటలు చెలరేగటంతో వరుసగా ఉన్న పూరిళ్లు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ ప్రమాదంలో ఉర నాగరాజు, గంధం వెంకటేశ్వర్లు, కొత్తూరి చిన్న గోపి, పోస్తాం కాలయ్య, పోస్తాం ఆంజనేయులు ఇండ్లు పూర్తిగా తగలబడిపోయాయి. సుమారు రూ.25 లక్షలు నష్టం వచ్చిందని బాధితులు వాపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై వివరాలు సేకరించారు.

Last Updated : Nov 1, 2020, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details