గుంటూరు జిల్లా సూర్యలంక తీరం మత్స్య సంపదతో కళకళలాడుతోంది. ఇక్కడి సముద్రంలో మత్తి, కవర రకం చేపలు విస్తారంగా లభిస్తున్నాయి. మత్స్యకారుల నుంచి వ్యాపారులు వీటిని కొని కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. గతంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లినా వలలో పడక కనీసం డీజిల్ ఖర్చులు రాక మత్స్యకారులు నష్టపోయేవారు. చేపల ఉత్పత్తి తగ్గి 2017, 2018లో 2నెలలు వేట కూడా సరిగా సాగలేదు. సముద్రంలో 50 నుంచి 60 కి.మీ.లోపలికి వెళ్తేనే చేపలు లభించేవి. 20శాతం మంది మత్స్యకారుల వద్దే అంత దూరం వెళ్లి వేట సాగించే మర పడవలున్నాయి.
80 శాతం మంది 30 కి.మీ.లోపే వలలు వేస్తున్నారు. వర్షాలు బాగా కురవటంతో వరదలు వచ్చి నదులు, కాల్వల నుంచి మంచినీరు సముద్రంలో ఎక్కువగా కలిసింది. దీని ప్రభావంతో మత్తి చేపల ఉత్పత్తికి అనువైన వాతావరణమేర్పడిందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబరు నుంచి సాగరంలో వేటకు వెళ్లిన వారికి వలల నిండా చేపలు పడుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా సూర్యలంక తీరంలోనే ఈ రకం చేపలు లభిస్తున్నాయి. వీటిలో పెద్దవాటిని తినటానికి, చిన్నవాటిని నూనె తీసేందుకు వినియోగిస్తారు. ఇక్కడ రోజూ 100నుంచి 200 టన్నుల మత్తి, కవర రకం చేపలను పడుతున్నారు.
రోజుకు 2 నుంచి 4 కంటెయినర్లు