ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసరావుపేటలో మరో రెండు కరోనా కేసులు

గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా కేసులు తగ్గటంలేదు. ఆదివారం కొత్తగా మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయయ్యాయి.దీంతో పట్టణంలో మెుత్తం కేసుల సంఖ్య 199కు చేరుకుంది.

By

Published : May 31, 2020, 9:21 PM IST

నరసరావుపేటలో మరో రెండు కరోనా కేసులు
నరసరావుపేటలో మరో రెండు కరోనా కేసులు

గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఆదివారం కొత్తగా మరో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసులు పట్టణంలోని ప్రకాష్ నగర్​కు చెందినవని అధికారులు తెలిపారు. వీటితో నరసరావుపేటలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 199 కు చేరుకున్నాయి.

వైరస్ వ్యాప్తి నివారణకు అధికారులు ఎన్నిచర్యలు చేపట్టినప్పటికీ పట్టణంలో కేసుల సంఖ్య తగ్గటం లేదు. దీంతో పట్టణ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details