గుంటూరు జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ రోజు మరో 31 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి జిల్లాలో కోవిడ్ కేసులు 762కు చేరుకున్నాయి. కొత్త కేసులు తాడేపల్లిలో 8 , గుంటూరులో 7, తెనాలిలో 5, బాపట్లలో 3, వినుకొండలో 2, మంగళగిరిలో 2, దుగ్గిరాలలో 2, రొంపిచెర్ల మండలం కొత్తపల్లిలో 1, ప్రత్తిపాడు మండలం తిక్కారెడ్డి పాలెంలో 1 కేసు నమోదయ్యాయి.
800కు చేరువలో కరోనా కేసులు... పోస్ట్ మెన్కు పాజిటివ్
గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. తాజాగా 31 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి మొత్తం జిల్లాలో కరోనా బారినపడినవారి సంఖ్య 762కు చేరింది. అయితే పత్తిపాడు మండలం తిక్కారెడ్డిపాలెంలో ఓ పోస్ట్ మెన్కు పాజిటివ్ రావటం.. నిన్నటి వరకూ అతను విధులకు హాజరుకావటం అటు ప్రజలకు ఇటు అధికారులకు ఆందోళన కలిగిస్తోంది.
గతంలో గ్రీన్ జోన్లుగా ఉన్న వినుకొండలో రెండు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఆ ప్రాంతంలో కేసులే లేవు. ఇక ప్రత్తిపాడు మండలం తిక్కారెడ్డిపాలెంలో ఓ పోస్ట్ మెన్ కు పాజిటివ్గా నిర్దరణ అయింది. మూడు రోజుల నుంచి అతను విధుల్లోనే ఉండటం, ఉత్తరాలు బడ్వాటా చేయటం స్థానికులను, అధికారులను ఆందోళన కలిగిస్తోంది. ఇపుడు అదికారుల ఆ గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలతో పాటు ఇంటింటి సర్వే చేపట్టారు. ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయా? అని ఆరా తీస్తున్నారు.
ఇదీ చూడండిరాష్ట్రంలో వైరస్ ఉద్ధృతి : దర్శి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నుంచి రైటర్కు