ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గొట్టిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందికి కరోనా

గుంటూరు జిల్లాలో కరోనా కలవరపెట్టిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రత్తిపాడు నియోజకవర్గంలో కరోనా వ్యాప్తి చెందుతోంది. గొట్టిపాడు ఆసుపత్రిలో ముగ్గురికి కరోనా నిర్థరణ కావడంతో ఆ గ్రామంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

By

Published : Jul 20, 2020, 3:06 PM IST

corona cases
corona cases

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వైద్య సిబ్బంది బంధువు ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో గ్రామంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రత్తిపాడు చైతన్య గోదావరి బ్యాంకులో ఒక ఉద్యోగికి కరోనా నిర్ధరణ అయింది. వీరందరికీ సంబంధించి నేరుగా కాంటాక్ట్ అయిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. గ్రామంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత భద్రత తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మాస్కులు లేకుండా బయటికి రావద్దని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details